సుధీర్ ఇంట్లో విషాదం.. చివరిచూపు కూడా దక్కలేదు!
on May 18, 2021
సుడిగాలి సుధీర్ గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఎంతో కష్టపడి టీవీ కమెడియన్ గా, హోస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 'జబర్దస్త్' లోకి రావడానికి ముందు సుధీర్ మెజీషియన్ గా పని చేశాడు. ఎన్నో ఈవెంట్స్ లో మ్యాజిక్ చేసిన సుధీర్ ఫైనల్ గా 'జబర్దస్త్' షోలో చేరి బాగా పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోతో బిజీగా ఉన్నాడు సుధీర్. మల్లెమాల ప్రొడక్షన్ లో ఈటీవీలో ప్రసారం అవుతున్న ఈ షోలో రామ్ ప్రసాద్, హైపర్ ఆది వంటి కమెడియన్స్ కూడా స్కిట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం టాప్ కామెడీ షోలలో ఒకటిగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సుధీర్ కంటతడి పెట్టుకున్నాడు. కారణం.. ఇటీవల సుధీర్ ఇంట్లో ఓ విషాదం చోటుచేసుకుంది. అతడి అమ్మమ్మ కరోనా సోకి కన్నుమూశారు. అయితే చివరిసారి ఆమెను చూడడానికి కూడా పరిస్థితులు అనుకూలించలేదని ప్రోమోలో సుధీర్ క్లోజ్ ఫ్రెండ్ రామ్ ప్రసాద్ ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు.
అమ్మమ్మ చనిపోయిందని తెలిసి సుధీర్ చాలా బాధపడ్డాడని చెబుతూ.. వెళ్లాలని ఉన్నా వెళ్లలేకపోయినట్లు రామ్ ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ఈ క్రమంలో సుధీర్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆదివారం మధ్యాహ్నం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ షోకి నటుడు పృథ్వీతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా వచ్చారు.
Also Read